AP : విశాఖ ఎంపీగా పనులు స్టార్ట్ చేస్తా.. కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్.. మరో విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. అలాంటిది తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పాల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కేఎ పాల్.. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజా శాంతి పార్టీకి మద్దతు తెలిపారని.. ఆశాభావం వ్యక్తం చేశారు కేఏ పాల్. అలాగే వైజాగ్ ఎంపీ స్థానంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపిందని.. వాటితో తనకు 10 లక్షల ఓట్లు వేసి ప్రజలు తన వైపు నిలబడ్డాని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా తానే గెలవబోతున్నానని… గురువారం నుంచి విశాఖపట్నం ఎంపీగా పనులు స్టార్ చేస్తానని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పడం వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com