YS Jagan : ముఖ్యమంత్రిని దారుణమైన బూతులతో తిడుతున్నారు : జగన్

YS Jagan : ముఖ్యమంత్రిని దారుణమైన బూతులతో తిడుతున్నారు : జగన్
YS Jagan : టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడుతున్నారని జగన్‌ విమర్శించారు. తమ పాలన మెచ్చుకుంటూ ప్రజలు పట్టంకడుతుంటే.. విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు.

YS Jagan : టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడుతున్నారని జగన్‌ విమర్శించారు. తమ పాలన మెచ్చుకుంటూ ప్రజలు పట్టంకడుతుంటే.. విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు. డ్రగ్స్ కేసుతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ కావాలనే రాష్ట్రం పరువు తీయాలని చేస్తున్నారని విమర్శించారు. భావోద్వేగాలు రెర్చగొట్టాలని చూస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న జగన్.. గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధికారం దక్కదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు సంక్షేమ పథకాల్ని కూడా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story