Jio Entry : ఆఫ్రికా దేశంలోకి జియో ఎంట్రీ

Jio Entry : ఆఫ్రికా దేశంలోకి జియో ఎంట్రీ
X

భారత టెలికం మార్కెట్లో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో ఆఫ్రికా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఘనాకు చెందిన నెక్స్ట్-జెన్ ఇన్ తో జత కట్ట నుంది. రిలయన్స్ కు చెందిన ర్యాడిసీస్ కార్ప్ దీనితో ఒప్పందం చేసుకోనుంది. ఘనాలో బిజినెస్ కు అవసరమైన మౌలిక వసతులను ఎన్ఐఐసీ ఏర్పాటు చేయనుంది.

ఇందుకు అవసమ రమయ్యే పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, అప్లికేషన్లను ర్యాడిసిస్ సమకూర్చనున్నట్లు ఎన్ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. భారత్ లో జియో అనుసరించిన వ్యూహాన్నే ఘనాలోనూ అమలు చేయాలని ఎన్ఐఐసీ భావిస్తోంది. 2016లో వచ్చిన జియో స్వల్ప కాలంలోనే భారత్ లో అగ్రగామి టెలికం ప్రొవైడర్ గా మారింది. ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరకే డేటా వంటి మార్కెటింగ్ వ్యూహాలతో ప్రత్యర్థి సంస్థలకు చెక్ పెట్టింది.

2024 సంవత్సరం చివరి నాటికి ఘనాలో కార్య కలాపాలు ప్రారంభించేందుకు ఎన్ఐఐసీ సన్నాహాలు చేసుకుంటోంది. ధర విషయంలో ఇప్పటి వరకు తమ వ్యూహాలను మాత్రం వెల్లడించలేదు. అక్కడ వచ్చే పదేళ్ల పాటు 5జీ సేవలను అందించేందుకు ఎస్ఐసీ అనుమతులు పొందింది. జియో ఎంట్రీతో.. ఎంటీఎన్ ఘనా, వోడాఫోన్ ఘనా, ఎయిర్టెల్ టిగో లాంటి సంస్థళకు పోటీ ఎదురయ్యే చాన్సుంది.

Tags

Next Story