Tollywood : ఇకనైనా టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుందా?

Tollywood : ఇకనైనా టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుందా?

నాగచైత్యన హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ లో తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ కూడా తెచ్చుకుంది. ఇందులో అమ్మడి గ్లామర్ షోకి సినీ అభిమానులంతా ఫిదా అయ్యారు. అయితే ఇస్మార్ట్ శంకర్ తరువాత అభిమానులను అంతగా అలరించలేదు నిధి.

పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు సినిమాలోనూ యాక్ట్ చేసి పాపులారిటీ తెచ్చుకున్నా.. టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం అంతగా రావట్లేదు. దీంతో కాస్త డీలా పడ్డ నిధికి.. ఈసారి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో ఈ బ్యూటీ చాన్స్ కొట్టేసింది.

ఇందులో ఇప్పటికే మాళవిక మోహనన్ హీరోయిన్ గా చేస్తుండగా.. నిధి కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. సోషల్ మీడియాలో నిధికి ఉన్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని రాజా సాబ్లో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ అమ్మడు షూటింగ్ లోనూ జాయిన్ అయినట్లు సమాచారం. మరి ఇప్పటికైనా టాలీవుడ్ మీద నిధి ఫోకస్ చేస్తుందా లేక మళ్లీ వెనకడుగు వేస్తుందా అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story