Prabhas : ప్రభాస్ కిర్రెక్కించే రోల్.. పరశురాముడిగా స్క్రీన్ చిరిగిపోవడం ఖాయం

Prabhas : ప్రభాస్ కిర్రెక్కించే రోల్.. పరశురాముడిగా స్క్రీన్ చిరిగిపోవడం ఖాయం

మన ప్రభాస్ (Prabhas) రేంజ్ రోజురోజుకూ.. మూవీ మూవీకి అమాంతం పెరిగిపోతోంది. వెండితెర దేవుడు, వెండితెర యోధుడు అంటే ప్రభాస్ తప్ప మరే హీరో కనిపించడం లేదు మేకర్స్ కు, అభిమానులకు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా కనిపించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ రోల్ మరెవరిదో కాదు.. మహా విష్ణువు ఆరో అవతారం అయిన పరుశురాముడు. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి ఉన్న దుర్మార్గులను సంహరించి భూభారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ దాల్చిన అవతారమే ఈ పరుశురాముడు. సప్త చిరంజీవులు పరశురాముని అవతారం కూడా ఒకటి. తండ్రి జమదగ్ని నుంచి అఖండ పరుశువు(గండ్ర గొడ్డలి)ని సాధించి ఎంతో ఖ్యాతిని పొందాడు. అందుకే ఆయనను పరుశురాముడు అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా గోపీచంద్ కొత్త సినిమాలోనూ పరుశురాముడి గురించి వినే ఉంటారు. 21సార్లు మొత్తం భూమండలాన్ని పర్యటించిన మహావిష్ణువు.. ఆధర్మ క్షత్రియులను హతమార్చాడు. వారి రక్తంతో తన పూర్వీకులకు ఆత్మసంతృప్తిని కల్పించాడు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే కచ్చితంగా ఓ రేంజ్ లో సినిమా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఐతే.. ప్రభాస్ నటించేది పరశురాముడి పాత్ర హీరోగా నడిచే సినిమాలో కాదు. ఇది స్పెషల్ రోల్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి.. రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో స్పెషల్ అపీరియన్స్ గా పరుశురాముడు కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాముడిగా రణ్‌బీర్‌, సీత గా సాయి పల్లవి, రావణుడి పాత్ర కోసం యష్‌, హనుమంతుడు పాత్రకు సన్నిడియోల్‌, విభిషనుడిగా విజయ్ సేతుపతి, సూర్పణకగా రకుల్ ప్రీత్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దీపావళికి రిలీజయ్యే ఈ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించనుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

Tags

Read MoreRead Less
Next Story