Fatal Accident : కారులో యముడు.. టైరు మారుస్తుండగా ఢీ.. ఆరుగురు మృతి

Fatal Accident : కారులో యముడు.. టైరు మారుస్తుండగా ఢీ.. ఆరుగురు మృతి

మృత్యువు కొన్నిసార్లు పగబట్టినట్టే వెంటాడుతుంది. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు టైర్‌ పంచర్‌ కావడంతో మార్చుకునేందుకు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపారు. అయితే.. అంతలోనే ప్రమాదం వారిపైకి దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన మరో కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం రాత్రి హర్యానాలోని రేవారి ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సాని గ్రామంలో గవర్నమెంట్‌ పాఠశాల దగ్గర కొందరు రోడ్డు పక్కన కారు టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దాంతో.. ఆ కారులోని వారు వాహనాన్ని రోడ్డు పక్కకే ఆపారు. ఆ తర్వాత టైర్‌ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

చీకట్లో వేగంగా మరో కారు దూసుకొచ్చింది. కారు నిలిపి ఉండటాన్ని గమనించకుడా దాన్ని ఢీకొట్టారు. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఢిల్లీలోని కథు విలేజ్‌ నుంచి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story