Fatal Acident : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్

Fatal Acident : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్

నంద్యాల జిల్లాలో (NandyaL District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు.

బాలకిరణ్ తల్లి దండ్రులు లక్ష్మీ, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి వేడుకలు జరగగా ఈ నెల 3న శామీర్ పేటలో రిసెప్షన్ అయినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉండగా.. నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story