Online Trading Scam : ఆన్ లైన్ ట్రేడింగ్‌తో రూ.9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త

Online Trading Scam : ఆన్ లైన్ ట్రేడింగ్‌తో రూ.9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త
X

నోయిడాకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్త 9 కోట్ల రూపాయల మేర సైబర్ వలలో మోసపోయారు. సైబర్ మోసంలో చిక్కుకున్న ఆయన ఏకంగా 9.09 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. నోయిడాలోని సెక్టర్ 40 కి చెందిన రజిత్ బోత్ర ఏప్రిల్ 28న ఓ లాభదాయమైన షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చిట్కాలను అందించే వాట్సప్ గ్రూపులో చేరడం జరిగింది.

అలా చేరిన నెల రోజుల లోపల అతను భారీ స్థాయిలో మోసపోయాడు. ఈ కేసు సంబంధించిన పోలీసులు అందించిన సమాచారం మేరకు.. వాట్సప్ లో ఆన్లైన్ షేర్లు కొనడానికి ఓ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా సదరు గ్రూప్ లో ముందు తెలిపారని బాధితుడు తెలిపాడు. దాంతో అతడు ఓ నకిలీ యాప్ ను డౌన్ లోడ్ చేసి అందులో ట్రేడింగ్ వ్యవహారాలను చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మే 27 నాటికి అతడు 9.09 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఖాతాలో అక్రమంగా జరిగిన లావాదేవీలు 1.62 కోట్ల నిధులను స్తంభింపచేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్రత్యేక పోలీసుల బృందం సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story