Tragic : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

ఆస్ట్రేలియాలో (Australia) తెలుగు వైద్యురాలు మృతి చెందింది. ఏపీలోని (AP) కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో (Queensland) ఉన్న బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com