TTD : శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠం కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 80,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,508 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం లెక్కించగా.. రూ.4.30 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారుల్ని టీటీడీ ఈవో జె శ్యామల రావు ఆదేశించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్నారని.. వారి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో సమీక్ష నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com