TTD : తిరుమలలో భక్తుల రద్దీ.. 18 గంటల సమయం

TTD : తిరుమలలో భక్తుల రద్దీ.. 18 గంటల సమయం
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,332 మంది దర్శించుకోగా 30,540 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.

సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ.. దీంతో.. గంటా 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టికెట్ల కోటాను పూర్తి చేశారు భక్తులు.. ఇక, 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్లు పూర్తిగా బుక్‌ చేసుకున్నారు.. 10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటా పూర్తి చేశారు.

మరోవైపు.. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బుక్‌చేసుకున్నారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదుల కోటాను పొందారు భక్తులు.. కాగా, వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభం అయినా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోన్న విషయం విదితమే.

Tags

Next Story