Sabarimala : శబరిమల దర్శనం.. 80 వేల మందికే

Sabarimala : శబరిమల దర్శనం.. 80 వేల మందికే

శబరిమల అయ్యప్ప దర్శనానికి ఇకపై రోజుకు 80 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దర్శనానికి 3, 4 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే 4న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రోజుకు వర్చువల్‌ క్యూ బుకింగ్‌ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80 వేల మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

మూడు నెలల ముందుగానే వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని మూడు నెలల ముందు వరకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం పెంచింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు సమయంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story