Kondagattu : నేడు పెద్ద హనుమాన్ జయంతి.. కొండగట్టులో భక్తుల రద్దీ

నేడు పెద్ద హనుమాన్ జయంతి కావడంతో కొండగట్టు క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. గత 2 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతుండగా, దీక్ష విరమణ చేయడం కోసం మాలదారులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతున్నామని, కొండపైకి 4 RTC బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కొండగట్టులో నేటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీక్షకు వచ్చే భక్తుల కోసం 300 మంది అర్చకులను, తలనీలాలు సమర్పించేందుకు 1500 మంది నాయీబ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతోంది. భక్తులకు తాగునీరు, కూల్ షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ తాగునీటి సమస్య, పారిశుధ్యం లోపించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com