Heavy Rains in Delhi : ఢిల్లీ అష్టకష్టాలు.. అతిభారీవర్షంలో మునక

దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొన్నటి వరకూ భానుడి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాల ధాటికి వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు. రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాలకు పలకరించిన రెండు రోజులకే దాదాపు 11 మంది మరణించారు.
వాయువ్య ఢిల్లీలోని బార్లీలో శనివారం వర్షం దంచికొట్టింది. దీంతో అండర్పెస్లు నీటిలో మునిగాయి. అందులో చిక్కుకున్న ఇద్దరు బాలురు మరణించగా.. ఓల్లాలో, నీటమునిగిన అందరిలో 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వరదలే కాకుండా వసంత్ విహార్ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి మరో ముగ్గురు మరణించారు. శిధిలాల ఉన్న వారిని బయటకు తీసే పనిలో ఉన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం.
దేశ రాజధానిలో మొదటి రోజు 22.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 1936 నుంచి ఇప్పటి వరకు జూన్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతంగా వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చిరిస్తోంది వాతావరణ శాఖ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com