Jail : జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ మృతి

Jail : జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ మృతి

గ్యాంగ్ స్టర్ల అడ్డా యూపీ అలర్ట్ అయింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జైల్లో గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) (63) గుండెపోటుతో చనిపోయాడు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో దోషిగా తేలడంతో అన్సారీ 2005 నుంచి జైల్లోనే ఉన్నాడు.

అన్సారీ మృతిపై వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. వాంతులు చేసుకున్నాక అపస్మారక స్థితికి వెళ్లాడని తెలిపారు. దాంతో.. జైలు అధికారులు ఆయన్ని చికిత్స కోసం దుర్గావతి మెడికల్ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించగా.. తొమ్మిది మంది వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది.

కానీ.. చికిత్స అందిస్తున్న క్రమంలోనే అన్సారీ గుండెపోటుతో చనిపోయారనీ వైద్యులు తెలిపారు. అన్సారీ మరణంపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై జైలులో విషప్రయోగం చేశారనీ అన్సారీ సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. బందా జైల్‌ సిబ్బంది స్లో పాయిజనింగ్ చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దాంతో.. అన్సారీ మృతితో ఆస్పత్రి పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. బందా, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో పోలీసులు, అదనపు బలగాలు మోహరించాయనీ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్‌ కుమార్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story