WAR: కరాచీ పోర్టుపై భారత్ దాడి

అరేబియా తీరంలోని కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసింది. గురువారం రాత్రి కరాచీ పోర్టును భారత్ టార్గెట్ చేసింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీ పోర్టు దాదాపు ధ్వంసమైందని తెలుస్తోంది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది.
పాకిస్తాన్లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా, రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనలతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు.
బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనూ కరాచీపై భారత్ భారీస్థాయిలో దాడులు చేసింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో.. భారత్లోని తొమ్మిది ఎయిర్బేస్లపై పాకిస్థాన్ దాడి చేసింది. **ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది. దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవడమే. ఈ నౌక MiG-29K, Kamov-32, MH-60R, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా 30 రకాల విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com