Chattisgarh : ఐఈడీ పేల్చిన మావోలు.. ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి ఇద్దరు జవాన్లు బలయ్యారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. రాయ్ పూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్గర్, టేకల్ గూడెం క్యాంపుల మధ్య ఉన్న తిమ్మాపురం గ్రామ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగింది.
ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కోబ్రాకు చెందిన 201వ యూనిట్ బెటాలియన్ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బందోబస్తు విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అందులో భాగంగానే సిల్డర్ క్యాంప్ నుంచి జాగర గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వైపుగా ట్రక్కు, బైకులపై పెట్రోలింగ్ నిర్వహించారు.
మావోయిస్టులు ఆ ట్రక్కుని లక్ష్యంగా చేసుకుని ఐఈడీని పేల్చా రు. ఈ పేలుడులో కానిస్టేబుల్ శైలేంద్ర (29), డ్రైవర్ వి ష్ణు ఆర్ (35) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో సీఐ ఆకాశ్, కానిస్టేబుల్ సంజయ్ కు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలను మోహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com