Tamilnadu MP : గుండెపోటుతో తమిళనాడు ఎంపీ మృతి
తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 2019లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.
దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు కుటుంబసభ్యులు. కాగా, అతను చికిత్స పొందుతుండగా ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గణేశమూర్తి ఎండీఎంకే శ్రేణుల్లో ప్రముఖ పదవులు చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com