Veerappan Daughter : పార్లమెంట్ ఎన్నికల బరిలో వీరప్పన్ కూతురు

Veerappan Daughter : పార్లమెంట్ ఎన్నికల బరిలో వీరప్పన్ కూతురు

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ కు పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన కుమార్తె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇన్నాళ్లు వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. తాజాగా ఆమె ఆ పార్టీని వీడారు. నామ్‌ తమిళర్‌ కట్చి నుంచి లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్నారు.

తమిళనాడులోని (Tamilnadu) కృష్ణగిరి నియోజకవర్గం నుంచి వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్‌సభ బరిలో నిలబడుతున్నారు. ఈ మేరకు మాట్లాడిన విద్యారాణి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేశారు. అంతేకాదు.. గిరిజనులు, దళితుల హక్కుల కోసం పోరాడారు. ఉద్యమకారణిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చిన విద్యారాణి 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పార్టీకి పనిచేశారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యాక్షురాలిగా కొనసాగారు.

ఇటీవల నటుడు, డైరెక్టర్‌ సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) పార్టీలో చేరేందుకు బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. ప్రస్తుతం విద్యారాణి ఎన్‌టీకే పార్టీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఎన్టీకే పార్టీకి తమిళనాడులో క్రమంగా ఆదరణ పెరగడం చూసి ఆమె ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 6.7శాతం ఓటు బ్యాంకును ఆ పార్టీ సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story