China : చైనాలో వరదలకు 47 మంది మృతి
చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మెయిజౌ నగరంలో శుక్రవారం 38 మంది మరణించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర విపత్తుల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికి గ్వాంగ్డాంగ్లో గురువారం ముందుగా అత్యవసర ప్రతిస్పందన స్థాయిని పెంచారు. తద్వారా ఆ సహాయం ప్రజలకు త్వరగా చేరుతుంది. అనేక ఇతర ప్రావిన్సులలో లెవెల్-IV అత్యవసర ప్రతిస్పందన ఇప్పటికే సక్రియం చేయబడింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చైనాలో వరదల సీజన్ ముందుగానే ప్రారంభమైందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com