Group-1 : గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు
గ్రూప్-1 పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. ఐపీఎస్లు సీతారామాంజనేయులు, గౌతమ్ సవాంగ్పై కేసు నమోదు చేయాలన్నారు.ఏపీపీఎస్సీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని, కమిషన్ పెద్దలు కోర్టును సైతం మోసం చేయాలనుకున్నారని అన్నారు.
రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతు కోశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైంది. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేశారని ఫైరయ్యారు.
మరోవైపు వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు.వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కర్నూలు అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలోలో చేరినట్లుగా సంజీవ్కుమార్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com