AP : టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్

AP : టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్

వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున హిందూపురం నుంచి బరిలోకి దిగి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. వైఎస్‌ జగన్‌ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారని ఆశించి భంగపడ్డ ఇక్బాల్‌ గత నాలుగురోజుల క్రితం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.

ఈ మేరకు సీఎం జగన్‌కు, మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపించారు. మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూడు టీడీపీకి తిరిగొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story