AP : మిషన్ పిఠాపురం.. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ సిద్ధం

AP : మిషన్ పిఠాపురం.. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ సిద్ధం

AP : ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నది పవన్ పిఠాపురం (Pithapuram) గురించే. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.

ఎలాగైనా పవన్ ను ఓడించాలన్న వైసీపీ పావులు కదపడం ప్రారంభించింది. పవన్ ప్రకటనతో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తనను కలవాలని వర్మకు సూచించారు.

ఇప్పటికే ఇక్కడ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పేరును ఖరారు చేశారు. పవన్ పోటీ చేయబోతున్నారన్న సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ద్వారా కొంతవరకు పవన్ కు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీపై నజర్ పెట్టి.. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టిడిపి-జనసేనల నుంచి వచ్చే నాయకులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story