AP : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

AP : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుంది. గురువారం నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్ (Lokesh), బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో లోకేష్, కుటుంబ సభ్యులు... శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. అటు కోడ్ కారణంగా శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా నేరుగా దర్శనానికి పంపిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 69072 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది.

Tags

Read MoreRead Less
Next Story