AP : రఘురామ ఎంట్రీ.. ఉండి టీడీపీలో రచ్చ

AP : రఘురామ ఎంట్రీ.. ఉండి టీడీపీలో రచ్చ

వైసీపీ రెబల్, ఏపీ ఎన్డీయే నేత రఘురామ కృష్ణంరాజు రాక ఉండి టీడీపీలో రచ్చ రేపుతోంది. ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనను వైదొలగాల్సిందేనని చెప్పడంతో .. నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించారు.

తనను తప్పుకోమంటున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు రామరాజు. గతంలో వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా ఉండేవారు. టీడీపీ తరపున రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు చివరి క్షణంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేయడంతో శివరామరాజు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఉండి అభ్యర్తిగా శివరామరాజు సిఫారసు చేసిన రామరాజుకే చంద్రబాబు చాన్సిచ్చారు. ఎంపీగా శివరామరాజు ఓడిపోయారు. ఎమ్మెల్యేగా రామరాజు గెలిచారు.

రఘురామకే టిక్కెట్ ఖరారు చేస్తే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. రఘురామ పోటీ చేస్తే.. శివరామరాజు రెబల్ గా బరిలోకి దిగుతానని ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరి మద్దతు ఎవరికి ఉంటుంది..చంద్రబాబు ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story