Road Accident : అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టిన కారు .. ఇద్దరు యువకులు మృతి

Road Accident : అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టిన కారు .. ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్– విజయవాడ రహదారిపై సూర్యాపేట మండలం రాయినిగూడెం దగ్గర్లోని రాజుగారి తోట హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వేసవి సెలవులు ఉండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన జటంగి సాయి (17), అంతటి నవీన్ (20), మారగోని మహేశ్, గణేశ్, శివ, చింతమళ్ల ధనుష్, ఉదయ్ ఓ అద్దె కారులో కేతేపల్లి నుంచి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నిమ్మకల్​లోని దండు మైసమ్మ తల్లి దర్శనానికి కారులో వచ్చారు.

తిరిగి వెళ్తుండగా అతివేగంతో కారు నడిపారు. రాజు గారి తోట సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టారు. ఈ ఘటనలో జటంగి సాయి, నవీన్ అక్కడికక్కడే చనిపోగా, మారగోని మహేశ్, గణేశ్​, శివ గాయపడ్డారు. సూర్యాపేట డీఎస్పీ రవి, రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు 160 కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు తెలిపారు.

ఉపాధిహమీ పనులకు వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్​ బోల్తా పడడంతో 18 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు, ఎస్సై లెనిన్ కథనం ప్రకారం..నాగర్​కర్నూల్ ​జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లికి చెందిన18 మంది కూలీలు గ్రామ శివారులో ఉపాధిహామీ పనులకు వెళ్లారు. పని పూర్తయ్యాక అదే గ్రామానికి చెందిన కొట్టె అంజనేయులు ట్రాక్టర్ పల్గురాయితో గ్రామానికి వస్తుండగా అందులో ఎక్కారు.

గ్రామ సమీపంలో కి రాగానే అదుపుతపి బోల్తా పడింది. దీంతో మాచర్ల చంద్రయ్య, మాచర్ల పార్వతమ్మ, కలమండల కృష్ణవేణి, కాంపల్లి శంకరయ్య తీవ్రంగా గాయపడ్డారు. మరో 14 మంది స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే అచ్చంపేట దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్​వంశీకృష్ణ హాస్పిటల్​కు వచ్చి టీట్మెంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story