లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2019-06-16 11:06 GMT

ఏపీకి ప్రత్యేక హోదా అంశమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని అన్నారు ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి. ప్రధాని ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించామని అన్నారాయన. ప్రత్యేక హోదా పార్లమెంట్ ద్వారా తమకు లభించిన హక్కు అని..దాన్ని నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. ఇక 9వ షెడ్యూల్ సవరించి జనాభా ప్రతిపాదికన బీసీల రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. ఇక లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని..అందుకే ఎలాంటి పదవులు తీసుకోబోమని అన్నారు విజయసాయిరెడ్డి.

Similar News