తెలంగాణ ప్రస్తుత నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకే తాను పార్టీ మారే నిర్ణయం తీసుకున్నాను అన్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ కారణంగా పార్టీ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. టీఆర్ఎస్పై పోరాడే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటున్నారు రాజగోపాల్. స్వలాభం చూసుకునేవాడిని అయితే టిఆర్ఎస్లో చేరేవాడిని అన్నారు రాజగోపాల్.