ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా ఘనత సాధించిన నిర్మలా సీతారామన్.. తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పలు కీలక నిర్ణయాలను సూచిస్తూ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది.
బడ్జెట్ ప్రసంగంలోని హైలెట్స్..
పెట్టుబడులు లేని వ్యవసాయన్ని (జీరో బడ్జెట్ వ్యవసాయం ) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే రైతులకు శిక్షణ * దేశవ్యాప్తంగా 1.25లక్షల కి.మీ. రహదారుల ఆధునీకీకరణ * అన్ని నివాసాలకు 2022 నాటికి విద్యుత్, గ్యాస్ సరఫరా * ఎఫ్డీఐలను మీడియా, యానిమేషన్, విమానయాన రంగంలో విస్తరిస్తాం *భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక చోరవ తీసుకుంటాం* స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు వెసులుబాటు. వాటికి విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు