శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో చోరికి గురైన ఏటిఎం మిషన్.. పోలాల్లో లభ్యమైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ప్లాజా సమీపంలో వ్యవసాయపొలంలో ఈ ఏటీఎంమిషన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటీవల ఎచ్చర్లలో ఏటీఎం మిషన్ మాయమైంది. అయితే.. సోమవారం లభించిన మిషన్ అదేనా కాదా అన్నది పూర్తిగా చెప్పలేమంటున్నారు పోలీసులు. అయితే.. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఈ మిషన్ను పరిశీలించి...ఇది ఎస్బీఐకి చెందినదిగా నిర్ధారించారు.