పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దారుణం జరిగింది. కన్న కూతురిని గర్భవతిని చేశాడో కీచక తండ్రి. విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి, బాలిక బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలో క్షుద్రపూజలు కలకలం:
తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాకినాడ గొడారిగుంట సీతారామాపురం ఉప్పర కమ్యూనిటిలో క్షుద్రపూజలు జరగడంతో... స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు.... కమ్యూనిటి హాల్లో పసుపు, కుంకుమ, కోళ్లతో పూజలు చేస్తున్న ఏడుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు.