కుళాయి వద్ద గొడవ.. మహిళ మృతి

Update: 2019-07-15 06:17 GMT

తాగునీటి కోసం కుళాయి వద్ద జరిగిన గొడవలో ఒక మహిళ మరణించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రంలోని పల్లివీధిలో పబ్లిక్ ట్యాప్‌ వద్ద తాతపు పద్మ, తెప్పల సుందరమ్మ మధ్య గొడవ మొదలైంది. మాటకుమాట పెరగడంతో ఇద్దరు ఘర్షణపడ్డారు. ఇద్దరు మహిళలు బిందెలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కొళాయి వద్ద ఉన్న నాచుపై కాలుజారి రోడ్డుకు తల బలంగా తగలడంతో తాతపు పద్మ అక్కడే చనిపోయింది. నీటికోసం జరిగిన గొడవలో పద్మ మరణించడంతో స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News