ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కీలక పదవి..

Update: 2019-07-24 09:43 GMT

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కీలక పదవిలో నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో పయ్యావులను పీఏసీ చైర్మన్ గా ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Similar News