ఏపీ ప్రభుత్వం ఐపీ పెట్టినట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి. నెలలు తరబడి వేతనాలు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. అయినా ప్రభుత్వం వాటిగురించి ఆలోచించడం లేదని విమర్శించారు. డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఉద్యోగులపై స్థానిక వైసీపీ నేతల బెదిరింపులు పెరిగాయని ఆరోపించారు..