ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న ఢిల్లీలో సమావేశమైన యూపీఎస్సీ ఎం ప్యానెల్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్.. ఇప్పటివరకు రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీగా ఉన్నారు.