ఏపీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు . ప్రభుత్వ తీరుతో యువత భవితవ్వంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీలు తమకు ప్రత్యర్థి పార్టీలేనని అన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. నాయకులు పార్టీలు మారడానికి అనేక కారణాలు ఉంటాయని పేర్కొన్నారు సుజనా చౌదరి