ఆర్టికల్ 370 రద్దు అప్రజాస్వామికమన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముగ్దుం భవన్లో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ పరిణామాలపై ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు ఏకమై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు డి. రాజా.