అమరావతిని వైసీపీ కొనసాగించదు.. నాకు పూర్తి సమాచారం ఉంది : ఎంపీ జీవీఎల్

Update: 2019-08-28 08:09 GMT

అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనేది వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు. ఈ మేరకు తనకు పూర్తి సమాచారం ఉందన్నారాయన. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న ఆయన.... దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జగన్‌ సర్కారును డిమాండ్‌ చేశారు. ఒత్తిళ్లతోనే మంత్రులు...ఇలాంటి ప్రకటన చేస్తున్నారన్నారాయన. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లతో కేవలం తాత్కాలిక భవనాల కే పరిమితం చేసిందని విమర్శించారు. అవసరానికి మించి అమరావతిలో భూమిని సేకరించారన్న ఆయన అమరావతికి 5 వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. అమరావతి తరలిపోతుంది అని లేనిపోని ప్రచారం చేస్తున్నారు

Similar News