జగన్ వంద రోజుల పాలనలో అరాచకం పెరిగిపోయిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. నిన్నటి నుంచి తమను గృహనిర్బంధంలో ఉంచడం దారుణమన్నారు. కార్యకర్తలను వేధించడంతో పాటు.. దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. వైసీపీ నాయకులతో పాటు.. పోలీసులు కూడా టీడీపీ నేతల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమన్నారు. తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందన్నారు.