అభిమాన నేత పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు దారిపొడవునా అభిమానులు

Update: 2019-09-17 09:27 GMT

తమ అభిమాన నేత పార్థివదేహాన్ని కడసారి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కడసారి చూసేందుకు దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. పసుపు జెండాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ప్రజలు, కార్యకర్తల సందర్శన కోసం సాయంత్రం వరకు కోడెల పార్థివదేహాన్ని గుంటూరు పార్టీ ఆఫీసులో ఉంచనున్నారు. తర్వాత నరసరావుపేటలోని స్వగృహానికి తీసుకెళ్తారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. నర్సరావుపేట డివిజన్‌లో 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బందోబస్తుపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. 144 సెక్షన్‌ అమలుపై టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెల అంతిమయాత్రను అడ్డుకునే ప్రయత్నమంటూ విమర్శలు గుప్పించారు. అటు విదేశాల నుంచి వచ్చిన కోడెల కుమారుడు శివరాం కాసేపటిక్రితం గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నరసరావు పేట వెళ్లిపోయారు.

Similar News