రైతు భరోసాలో పచ్చి మోసం : దూళిపాళ్ల నరేంద్ర

Update: 2019-10-13 09:02 GMT

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర. రైతు భరోసాలో జగన్ పచ్చి మోసానికి పాల్పడుతున్నారని.. కేంద్రం ఇచ్చే నగదును కూడా వైసీపీ తమ ఖాతాలో వేసుకుంటోందని ఆయన ఆరోపించారు. రైతులలో కుల ప్రస్తావన తెచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. నిబంధనల పేరుతో జగన్ రైతులను వేధిస్తున్నారని, స్పష్టత లేని రైతు భరోసాను చూస్తే వైఎస్ ఆత్మ ఘోషిస్తుందన్నారు ధూళిపాళ్ల.

Similar News