ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్తో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణ, ప్రత్యామ్నాయ విధానాలపై చర్చిస్తున్నారు. మరోవైపు శనివారం కేబినెట్లోనూ ఆర్టీసీ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.