అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా జరగలేదన్న మంత్రి బొత్సపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. అమరావతిలో పలు నిర్మాణాలను టీడీపీ బృందం పరిశీలించిందని.. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు 280 ప్లాట్స్ సిద్ధం అయ్యాయన్నారు. 60 రోజుల్లో పూర్తయ్యే నిర్మాణాలను నిలిపివేశారంటూ వైసీపీ సర్కార్పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు గుర్తొస్తారనే ఆలోచనతోనే.. కుట్రపూరితంగా నిర్మాణాలు ఆపేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.