ప్రజల కోరిక మేరకే ఏపీలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగుమాధ్యమంలో చదువుకునేందుకు ఎవరైనా ముందుకువస్తే.. తెలుగుమీడియాన్ని కూడా కొనసాగించాలని సీఎం జగన్ను కోరుతానని చెప్పారు యార్లగడ్డ. తెలుగును ఒక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టడం వల్ల భాషకు మేలే జరుగుతుందని అన్నారు.