ఏపీ రాజధానిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నెల 28న రాజధానిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది అన్నారు. అమరావతిలో ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఆరు నెల్లలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేకపోయిందన్నారు. ఆరు నెల్లలో ఆరు రూపాయల అవినీతి నిరూపించలేకపోయిన వైసీపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.