మహారాష్ట్ర పరిణామాలపై ఉదయం లోక్సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మార్షల్స్కు, కాంగ్రెస్ ఎంపీలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓమ్ బిర్లా ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. సభ్యుల తీరుపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఎంపీల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.