అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పండుగలన్నింటినీ ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్లో క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు 5 వేల మందికి గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.