TS : నేడు తెలంగాణలో తమిళిసై, నడ్డా ఎన్నికల ప్రచారం

Update: 2024-04-29 06:43 GMT

 తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి 10 రోజులపాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది.

మరోవైపు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం మల్కాజిగిరి పరిధిలోని నిజాంపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమరంలో అంతిమంగా నిలిచేదెవరో ఇవాళ తేలిపోనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ఛాన్సుంది. ఇప్పటికే స్క్రూటినీలో కొందరి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. తెరవెనుక చర్చలు, బుజ్జగింపులు, బేరసారాల అనంతరం అసంతృప్తులు, టికెట్లు దక్కక నామినేషన్లు వేసిన వారు వెనక్కి తగ్గే ఛాన్సుంది.

Tags:    

Similar News