ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతలు మాట మార్చడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు మాట మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుంది అంటూ పదే పదే చెబుతూ వచ్చిన నేతలు.. ఇప్పుడు అధినేత జగన్ నిర్ణయంతో సైలెంట్ అయిపోయారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఏపీ రాజధానిపై తమ పార్టీకి వేరే ఆలోచన లేదని.. ఏపీ రాజధాని అమరాతితో పాటు, ప్రత్యేక హోదా, విభజన హామీలను తమ మేనిఫెస్టోలో పెడుతున్నామంటూ ఆయన వివరణ ఇచ్చారు.. కానీ ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చినా.. ఆయన నోరు మెదపకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.