పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తోంది బీజేపీ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పాల్గొన్నారు. ద్వేష పూరిత భావనతో ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు మైనారిటీల్లో భయాందోళన కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని జీవీఎల్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ భారతీయులకు సంబంధించిన అంశమే కాదని అన్నారాయన.